నేటి ఆధునిక జీవనశైలి కారణంగా చిన్న వయసులోనే అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయసువారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవడం, శారీరక శ్రమ లోపించడం, మానసిక ఒత్తిడి వంటి కారణాలే దీనికి ప్రధాన కారణాలుగా పేర్కొంటున్నారు.
వైద్యుల ప్రకారం, అధిక రక్తపోటు ఒక నిశ్శబ్ద వ్యాధి. ప్రారంభ దశలో స్పష్టమైన లక్షణాలు కనిపించకపోవడంతో చాలా మంది దీన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే దీన్ని అదుపులో పెట్టుకోకపోతే గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రాణాపాయకర సమస్యలకు దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
ఎందుకు వస్తుంది?
వైద్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం, ఫాస్ట్ ఫుడ్, ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారం మానసిక ఒత్తిడి, టెన్షన్ఎ క్కువసేపు కూర్చుని పని చేయడం, నిద్రలేమి, వ్యాయామం లేకపోవడం, అధిక బరువు వంటి కారణాలు అధిక రక్తపోటుకు ప్రధానంగా దారితీస్తున్నాయి.
అధిక రక్తపోటు లక్షణాలు
అధిక రక్తపోటు ఉన్నవారిలో ఈ లక్షణాలు కనిపించవచ్చు… తరచుగా తలనొప్పి, తల భారంగా అనిపించడం, తల తిరగడం, అనవసర భయం లేదా ఆందోళన, అప్పుడప్పుడు చూపు మసకబారడం, అలసట, విశ్రాంతి లేకపోవడం.
ఎలా నియంత్రించాలి?
అధిక రక్తపోటును అదుపులో ఉంచుకోవాలంటే జీవనశైలిలో మార్పులు తప్పనిసరి అని వైద్యులు సూచిస్తున్నారు.
రోజుకు 5 గ్రాములకంటే ఎక్కువ ఉప్పు తీసుకోకూడదు. జంక్ ఫుడ్, ప్యాక్ చేసిన ఆహారాన్ని తగ్గించాలి. ప్రతిరోజూ నడక లేదా వ్యాయామం చేయాలి. యోగా, ధ్యానం ద్వారా మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. సరిపడా నిద్ర తీసుకోవాలి, బరువును నియంత్రణలో ఉంచుకోవాలి.
ప్రారంభ దశలోనే రక్తపోటును గుర్తించి నియంత్రించుకుంటే, భవిష్యత్తులో వచ్చే తీవ్ర ఆరోగ్య సమస్యలను నివారించవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
- వాట్సప్ యూజర్లకు కీలక హెచ్చరిక: ఈ సెక్యూరిటీ ఫీచర్లు ఆన్ చేయకపోతే ప్రమాదమేReading Time: < 1 minuteప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగిస్తున్న మెస్సేజింగ్ యాప్గా WhatsApp కొనసాగుతోంది. స్మార్ట్ఫోన్ ఉన్న దాదాపు ప్రతి ఒక్కరూ వాట్సప్ను వినియోగిస్తూ, చాటింగ్, వాయిస్ కాల్స్, వీడియో… Read more: వాట్సప్ యూజర్లకు కీలక హెచ్చరిక: ఈ సెక్యూరిటీ ఫీచర్లు ఆన్ చేయకపోతే ప్రమాదమే
- చిన్న వయసులోనే అధిక రక్తపోటు: నిశ్శబ్దంగా దాడి చేసే ప్రమాదకర వ్యాధిReading Time: < 1 minuteనేటి ఆధునిక జీవనశైలి కారణంగా చిన్న వయసులోనే అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా 30 నుంచి 35 ఏళ్ల మధ్య… Read more: చిన్న వయసులోనే అధిక రక్తపోటు: నిశ్శబ్దంగా దాడి చేసే ప్రమాదకర వ్యాధి
- దేశవ్యాప్తంగా బ్యాంక్ ఉద్యోగుల సమ్మె: ఈ రోజు బ్యాంకింగ్ సేవలకు అంతరాయంReading Time: < 1 minuteదేశవ్యాప్తంగా బ్యాంక్ వినియోగదారులకు మరోసారి ఇబ్బందులు తప్పేలా లేవు. వరుస సెలవులతో ఇప్పటికే గత మూడు రోజులుగా బ్యాంకులు పనిచేయని పరిస్థితిలో, ఈ రోజు… Read more: దేశవ్యాప్తంగా బ్యాంక్ ఉద్యోగుల సమ్మె: ఈ రోజు బ్యాంకింగ్ సేవలకు అంతరాయం
- లైంగిక వేధింపుల కేసులో బాలీవుడ్ నటుడు నదీమ్ ఖాన్ అరెస్టుReading Time: < 1 minuteబాలీవుడ్ నటుడు నదీమ్ ఖాన్పై లైంగిక వేధింపుల ఆరోపణలతో పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల విడుదలైన బ్లాక్బస్టర్ చిత్రం ధురంధర్లో… Read more: లైంగిక వేధింపుల కేసులో బాలీవుడ్ నటుడు నదీమ్ ఖాన్ అరెస్టు
- కొలెస్ట్రాల్ నియంత్రణలో భారత్ కొత్త దారి: హైటెక్ పరిశోధనలతో ప్రపంచానికి దిక్సూచిReading Time: < 1 minuteప్రపంచవ్యాప్తంగా గుండె జబ్బులకు ప్రధాన కారణంగా మారిన కొలెస్ట్రాల్పై భారత్ కీలక అడుగులు వేస్తోంది. భారతీయ శాస్త్రవేత్తలు ఇటీవల చేసిన పరిశోధనలు అంతర్జాతీయ వైద్య… Read more: కొలెస్ట్రాల్ నియంత్రణలో భారత్ కొత్త దారి: హైటెక్ పరిశోధనలతో ప్రపంచానికి దిక్సూచి
- పాలు అందరికీ ఆరోగ్యకరమేనా? తాజా అధ్యయనాలు ఏమంటున్నాయిReading Time: < 1 minuteపాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయన్న విషయం అందరికీ తెలిసిందే. చిన్నప్పటి నుంచే పిల్లలకు పాలు తాగడం అలవాటు చేయడం వెనుక శరీర బలం, ఎముకల… Read more: పాలు అందరికీ ఆరోగ్యకరమేనా? తాజా అధ్యయనాలు ఏమంటున్నాయి
- చీకటిగా మారుతున్న సముద్రాలు – కలుషితాలు పెరిగిReading Time: 2 minutesనాలుగింట మూడు వంతుల భూమి నీటి తో కప్పబడి ఉన్నది. కాబట్టి భూమి నీలి రంగులో కనబడుతుంది. భూమిపై ఉన్న నీటిలో దాదాపు 97%… Read more: చీకటిగా మారుతున్న సముద్రాలు – కలుషితాలు పెరిగి
- Cinnamon Water: దాల్చిన చెక్క నీటితో ఈజీగా బరువు తగ్గొచ్చు.. తయారీ విధానం ఎలాగంటే..Reading Time: < 1 minuteదాల్చిన చెక్కలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు శరీరానికి రక్షణగా పనిచేస్తాయి. దాల్చిన చెక్క ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచి, రక్తంలో చక్కెర… Read more: Cinnamon Water: దాల్చిన చెక్క నీటితో ఈజీగా బరువు తగ్గొచ్చు.. తయారీ విధానం ఎలాగంటే..
- Indian Railways: రైల్వే ప్రయాణికులకు స్వల్ప ఊరట.. ఛార్జీల పెంపుపై కేంద్రమంత్రి క్లారిటీ!Reading Time: < 1 minuteరైల్వే ప్రయాణికులకు కేంద్రం ఊరటనిచ్చే వార్త చెప్పింది. దేశంలో రైల్వే ఛార్జీలను స్వల్పంగా పెంచబోతున్నట్టు ఇటీవలే రైల్వేశాఖ నిర్ణయం తీసుకుందంటూ వచ్చిన వార్తల నేపథ్యంలో… Read more: Indian Railways: రైల్వే ప్రయాణికులకు స్వల్ప ఊరట.. ఛార్జీల పెంపుపై కేంద్రమంత్రి క్లారిటీ!








