Reading Time: < 1 minute

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
04-02-2026

జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారామ్ రాథోడ్ ఈరోజు జిల్లా కార్యాలయంలో 102, 108 అంబులెన్స్ వాహనాల కోఆర్డినేటర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా డాక్టర్ తుకారామ్ రాథోడ్ అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ సేవలను సమర్థవంతంగా వినియోగించాలని ఆదేశించారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలను సురక్షిత ప్రసవాల కోసం ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించడం, గ్రామీణ మరియు దూర ప్రాంతాల్లో కూడా వాహనాలు సమయానికి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవడం అత్యంత అవసరమని సూచించారు.

అంతేకాక, అంబులెన్స్ వాహనాలను ప్రతి పరిధిలో సిద్ధంగా ఉంచి గర్భిణీలు, బాలింతలు మరియు ఇతర అత్యవసర రోగులకు తక్షణ సేవలు అందేలా కృషి చేయాలని సూచించారు.

సదరు కార్యక్రమంలో 102, 108 జిల్లా కోఆర్డినేటర్లు, డిపిఎంవో మోహన్ తదితర అధికారులు పాల్గొన్నారు.