Reading Time: < 1 minute

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ: 44వ డివిజన్ గాంధీనగర్‌కు చెందిన చింతల చెరువు ప్రమీల మరణించిన విషయం తెలిసిన వెంటనే, స్థానిక నాయకుడు పొనిశెట్టి వెంకటేశ్వర్లు వారి నివాసానికి వెళ్లి భౌతికాయానికి పూలదండ వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఆయన ప్రమీల కుటుంబ సభ్యులను పరామర్శించి, ఈ క్లిష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని సూచిస్తూ మనోధైర్యం చెప్పారు. ప్రమీల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.