Reading Time: < 1 minute

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
05-03-2026

నూతన జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం, జిల్లా కలెక్టర్ అంకిత్ గురువారం జిల్లా కోర్టు కార్యాలయంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి వసంత పాటిల్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా వసంత పాటిల్ కలెక్టర్ అంకిత్‌కు జిల్లా బాధ్యతలు స్వీకరించినందుకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ఈ సమావేశం జిల్లా కార్యాలయాల్లో పరస్పర అవగాహన మరియు సమన్వయాన్ని మరింత బలోపేతం చేసే అవకాశం ఇచ్చిందని అధికారులు తెలిపారు.