భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
05-03-2026
జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి (DM&HO) భద్రాచలం సుజాతనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) ను సందర్శించి రాబోయే మిషన్ హెల్త్–100 ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాట్లను విపులంగా పరిశీలించారు.
DM&HO అన్ని విభాగాలను సమీక్షించి, స్పెషలిస్ట్ వైద్యుల కన్సల్టేషన్ గదులు, ప్రయోగశాల, ఔషధ పంపిణీ కేంద్రం, రిజిస్ట్రేషన్ & హెల్ప్ డెస్క్ కౌంటర్లు, వేచిచూసే ప్రదేశాలు, త్రాగునీరు, పారిశుద్ధ్య సదుపాయాలు, IEC ప్రచార బోర్డులు, Sign Boards, బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ, రోగుల రాకపోకల సమన్వయం వంటి అంశాలను సవివరంగా పరిశీలించారు.
DM&HO అధికారులు సిబ్బందికి అన్ని విభాగాలు సమయపాలనతో పనిచేయడం, అవసరమైన ఔషధాలు, ల్యాబ్ పరీక్షలు అందుబాటులో ఉంచడం, లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సక్రమ ప్రణాళికతో ఏర్పాట్లు చేయడం ఆదేశించారు.
అనంతరం నిర్వహించిన ఆశా దినోత్సవ సమావేశంలో, DM&HO ఆశా కార్యకర్తలు, ANMs, ఇతర సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడి, స్వయం సహాయక సంఘాల (SHG) మహిళలను ఆరోగ్య ప్రొఫైల్ స్క్రీనింగ్లో సమీకరించడం, గ్రామ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, గర్భిణీలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న లబ్ధిదారులు శిబిరానికి హాజరే కావడం ముఖ్యమని పేర్కొన్నారు. అలాగే ఫ్యామిలీ ప్లానింగ్ సేవలు బలోపేతం చేసి, ఆరోగ్య సూచికలు మెరుగుపరచడం కోసం కృషి చేయాలని సూచించారు.
తదుపరి DM&HO జూలూరుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను కూడా సందర్శించి, రేపు నిర్వహించనున్న శిబిర ఏర్పాట్లను సమీక్షించారు.b శిబిరంలో ఈ ఆరు విభాగాల నిపుణ వైద్యులు సేవలు అందించనున్నారు.
సాధారణ వైద్య నిపుణుడు, కంటి వైద్య నిపుణుడు, ఎముకల వైద్య నిపుణుడు, స్త్రీరోగ నిపుణుడు, శిశు వైద్య నిపుణుడు, దంత వైద్య నిపుణుడు, DM&HO వైద్య అధికారులకు అన్ని గ్రామాలలో మైకింగ్ ప్రకటనలు నిర్వహించి, ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు, చిన్నపిల్లలు, దీర్ఘకాలిక వ్యాధుల లబ్ధిదారులు తప్పనిసరిగా శిబిరానికి హాజరుకావాలని సూచించారు.
మిషన్ హెల్త్–100 కార్యక్రమం మిగిలిన 99 రోజుల్లో స్వయం సహాయక సంఘాల మహిళల ఆరోగ్య ప్రొఫైల్ స్క్రీనింగ్ వేగవంతం చేసి, జిల్లా వ్యాప్తంగా సమగ్ర ఆరోగ్య సేవలు ప్రజలకు చేరవేయడం లక్ష్యంగా ఉంటుంది. ఈ కార్యక్రమంలో పాల్వంచ డిప్యూటీ DM&HO కార్యాలయంలో సంత్ సేవాలాల్ జయంతిని పురస్కరించుకొని భోగ్ బండారు కార్యక్రమం నిర్వహించబడింది. వైద్య & ఆరోగ్య శాఖ బంజారా ఉద్యోగ సిబ్బంది కూడా హాజరయ్యారు.
- పాల్వంచలో భక్తి వైభవంగా శ్రీనివాస కళ్యాణ మహోత్సవం – పాల్గొన్న మంత్రులు పొంగులేటి, తుమ్మల
- పాల్వంచలో నవ మహిళా సాధికార కేంద్రంలో యోగ్యత పత్రాలు, చెక్కుల పంపిణీ
- శ్రీరామనవమి ఏర్పాట్లకు సి ఎస్ ఆర్ సంస్థల సహకారం అవసరం: కలెక్టర్ అంకిత్
- పదవ తరగతి పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్
- జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ కొరత లేదు – వదంతులను నమ్మవద్దు: కలెక్టర్ అంకిత్





