Reading Time: < 1 minute

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:
04-03-2026

జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ ఉత్సవాల్లో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పాల్గొన్నారు.

వెదురు వేడుకలు ప్రారంభంలో జిల్లా పోలీస్ అధికారులు ఎస్పీ క్యాంప్ కార్యాలయానికి వెళ్లి ఎస్పీ రోహిత్ రాజును ఆహ్వానించారు. అధికారులు, సిబ్బంది రంగులు చల్లుతూ, ఆనందంగా హోలీ వేడుకలను జరిపారు. అనంతరం, హేమచంద్రాపురంలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వద్ద పోలీస్ బ్యాండ్ సంగీతానికి నృత్యాలతో వేడుక కొనసాగింది.

ఈ కార్యక్రమంలో భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, కొత్తగూడెం డిఎస్పీ ఆదినారాయణ, పాల్వంచ డిఎస్పీ సతీష్ కుమార్, మణుగూరు డిఎస్పీ రవీందర్ రెడ్డి, ఇల్లందు డిఎస్పీ వెంకన్న బాబు, సీఐలు, ఎస్సైలు, మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. హెడ్‌క్వార్టర్స్‌లో ఆనందోత్సవాల మధ్య కేరింతలతో హోలీ వేడుక ఘనంగా ముగిసింది.