భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
04-02-2026
జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారామ్ రాథోడ్ ఈరోజు జిల్లా కార్యాలయంలో 102, 108 అంబులెన్స్ వాహనాల కోఆర్డినేటర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా డాక్టర్ తుకారామ్ రాథోడ్ అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ సేవలను సమర్థవంతంగా వినియోగించాలని ఆదేశించారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలను సురక్షిత ప్రసవాల కోసం ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించడం, గ్రామీణ మరియు దూర ప్రాంతాల్లో కూడా వాహనాలు సమయానికి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవడం అత్యంత అవసరమని సూచించారు.
అంతేకాక, అంబులెన్స్ వాహనాలను ప్రతి పరిధిలో సిద్ధంగా ఉంచి గర్భిణీలు, బాలింతలు మరియు ఇతర అత్యవసర రోగులకు తక్షణ సేవలు అందేలా కృషి చేయాలని సూచించారు.
సదరు కార్యక్రమంలో 102, 108 జిల్లా కోఆర్డినేటర్లు, డిపిఎంవో మోహన్ తదితర అధికారులు పాల్గొన్నారు.
- పాల్వంచలో భక్తి వైభవంగా శ్రీనివాస కళ్యాణ మహోత్సవం – పాల్గొన్న మంత్రులు పొంగులేటి, తుమ్మల
- పాల్వంచలో నవ మహిళా సాధికార కేంద్రంలో యోగ్యత పత్రాలు, చెక్కుల పంపిణీ
- శ్రీరామనవమి ఏర్పాట్లకు సి ఎస్ ఆర్ సంస్థల సహకారం అవసరం: కలెక్టర్ అంకిత్
- పదవ తరగతి పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్
- జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ కొరత లేదు – వదంతులను నమ్మవద్దు: కలెక్టర్ అంకిత్





